జనసేన పార్టీ లోకి చేరికలు..||NEWS9 TV

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో జనతా గ్యారేజ్ ప్రాంగణంలో మై పాలరాము ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పాతం శెట్టి సూర్య చంద్ర చేతుల మీదుగా సుమారుగా 200 మందికి జనసేన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను పేదల కష్టాలు ఎలా ఉంటాయనేది అనుభవించానని నాలాగా మీరు కూడా కష్టపడకుండా ఉండాలనే తాపత్రయంతో జనసేన పార్టీ లోకి చేరి ఎమ్మెల్యే గా నెగ్గి నిరుపేదలైన అందరికీ న్యాయం చేస్తానని ఆయన తెలియచేశారు. అవ్వలకు కండువాలు వేసి వాళ్ల కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడాలని ఆశతో పోటీ చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, గవిడి దుర్గా ప్రసాద్, టమాటపు కన్నబాబు, ఉంగరాల శివాజీ, దోసపాటి సుబ్బారావు, కుమార్ రాజా, గాదె రాంబాబు, గుర్రాల సాయి, వెంకటరమణ, ప్రసాదు, మిరియాల గాంధీ, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Comments

Comments are disabled for this post.