శ్రీ రామనవమి వేడుకలను పలు మండలాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు పానకాలు, ప్రసాదాలు అందించారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం లంకురులో శ్రీరామ నవమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రామాలయం వద్ద శ్రీరామ పట్టాభిషేక వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సుమారు 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఉత్తర దిశ రామాలయం ఈ రామాలయకి మారో పెరు కాపులు రామాలయం అని పిలుస్తారు అని అన్నారు శ్రీ రామ నవమి వచ్చిందాంటే గ్రామం లో పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద పండగల జరుపుకుంటారని అన్నారు శ్రీరామ నవమి అనంతరం ఆలయం వద్ద గొప్ప అన్న సమారాధన నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మట్టా వశంతారావు, మట్టా శ్రీను, రెలంగి రాము, మట్టా పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Comments are disabled for this post.