గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాలు హోరాహోరు గా సాగుతున్నాయి. మండల కేంద్రంలో ఎంపీటీసీగా బరిలో ఉన్నా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎగదండి స్వామి అరుంధతి వార్డుల వారీగా ప్రచారం నిర్వహించారు. స్వామి మాట్లాడుతూ ప్రజలు మా ప్రచారాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నారని అన్నారు. Trs పార్టీ అన్ని పథకాలలో విఫలం అయిందని, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోడానికి కారణం అయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జడ్పీటీసీ అభ్యర్థి కటకం సరితని, ఎంపీటీసీ అభ్యర్థి అరుంధతిని భారీ మెజారిటీ గెలిపించాలన్నారు.
Comments
Comments are disabled for this post.